NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త
    అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త

    Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.

    గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కౌలు డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

    రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా, మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగింది.

    రైతులు మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఏర్పాటైన ఆర్-5 జోన్‌ను వ్యతిరేకించారు.

    అమరావతిలో భూమిలేని వారికి నివాస స్థలాలు ఇచ్చే ప్రణాళికను సుప్రీంకోర్టు వ్యతిరేకించడంతో, జగన్ ప్రభుత్వం రైతుల కౌలు చెల్లింపులను నిలిపివేసింది.

    రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ, అవి పెండింగ్‌లో ఉన్నాయి.

    వివరాలు 

    రూ. 255 కోట్లు రైతుల ఖాతాల్లో..

    ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, సీఎం చంద్రబాబు రైతుల బకాయిలను చెల్లించడంతో పాటు, రాజధాని నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

    అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు నెలల కిందట 9వ సంవత్సరానికి సంబంధించిన కౌలు చెల్లింపులు చేశారు.

    సంక్రాంతి పండుగ సందర్భంగా 10వ సంవత్సరానికి సంబంధించిన రూ. 255 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

    అంతేకాకుండా, రాజధానిలో భూమిలేని నిరుపేదలకు నెలవారీ పెన్షన్లను కూడా చెల్లించారు, దీనితో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

    వివరాలు 

    మూడేళ్లలో రాజధాని నిర్మాణం 

    ఎన్నికల ముందు కూటమి తరఫున టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీలు ఏకైక రాజధాని అమరావతేనని హామీ ఇచ్చాయి.

    తిరిగి నిర్మాణాలను ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారు. ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు కలిసి మొత్తం రూ. 31వేల కోట్ల రుణం మంజూరు చేశాయి.

    ఈ రుణంతో అసంపూర్తిగా ఉన్న భవనాలు, సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, జడ్జీలు ఇతర భవనాల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.

    సీడ్ యాక్సెస్ రోడ్లు, అంతర్గత రహదారులు, రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.

    వీటి కోసం సీఆర్డీయే టెండర్లు పిలిచింది. రాజధాని రైతులకు మరో ఐదేళ్ల కౌలు చెల్లింపులను చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.

    రాబోయే మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    చంద్రబాబు నాయుడు

    Tata Group: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ భేటీ  టాటా గ్రూప్
    Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు నరేంద్ర మోదీ
    Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు కర్నూలు
    CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025