NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
    మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..

    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అన్నారు.

    సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఒకప్పుడు నేరచరిత కలిగినవారిని రాజకీయ నాయకులు కలవడానికే భయపడే రోజులు ఉండేవని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు మాత్రం నేరస్థులను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.

    నేరస్థులకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రజలకు సంకేతాలు ఇస్తూ రాజకీయాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    వివరాలు 

    వైకాపా పాలనపై మంత్రుల విమర్శలు 

    చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ, గత సంవత్సరం పరిపాలన అన్ని విధాలా సక్రమంగా సాగిందని పేర్కొన్నారు.

    మంత్రులు మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు.

    ప్రజల్లో భాగస్వామ్యం పెంచేందుకు మంత్రులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. తప్పు చేసిన ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.

    గత వైకాపా ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.

    గత పాలనలో ఎలాంటి నేరం చేయకపోయినా తెలుగుదేశం నాయకులను అక్రమంగా జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు.

    అప్పుడు తమపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే ధోరణి మనది కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

    వివరాలు 

    పోలవరం-బనకచర్లపై ప్రగతిశీల స్పందన 

    గత ప్రభుత్వ అవినీతి,అక్రమాలకు సంబంధించి పారదర్శకంగా విచారణలు జరుపుతామని తెలిపారు.

    నేరం రుజువైతే ఎవరైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపుల వైఖరి తమది కాదని, ఈ తేడాను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

    పోలవరం,బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన వస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ జరిగుతోందని చెప్పారు.

    వివరాలు 

    కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: 

    సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    వివిధ సంస్థలకు భూముల కేటాయింపులు, రాయితీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    శ్రీకాకుళం జిల్లాలో రక్షిత నీటి సరఫరా కోసం రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆమోదం ఇచ్చారు.

    కుప్పం ప్రాంతానికి రూ.8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

    మంచి ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హత పొందిన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.

    మొత్తం 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.

    వివరాలు 

    కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: 

    వైఎస్సార్ జిల్లాను "వైఎస్సార్ కడప జిల్లా"గా మార్చే జీవోకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం.

    మహిళలు రాత్రిపూట కూడా పనిచేయడాన్ని అనుమతించే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    రాత్రి పని చేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించాల్సిందిగా నిర్ణయం తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్
    Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు  బంగ్లాదేశ్
    Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు! రాహుల్ గాంధీ
    Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?  జీవనశైలి

    ఆంధ్రప్రదేశ్

    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ
    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు భారతదేశం
    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  లైఫ్-స్టైల్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025