NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు 
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు 
    రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు

    Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రయత్నిస్తోంది.

    ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 3,000 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గించుకునే అవకాశం ఉందని ఆర్థికశాఖ లెక్కలు చెప్పింది.

    రాష్ట్ర రుణాల రీఫైనాన్సింగ్‌కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు.

    ముఖ్యకార్యదర్శి పీయూష్‌కుమార్ ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శులకు సమర్పించారు, దీనికి సానుకూల స్పందన వచ్చింది.

    వివరాలు 

    వడ్డీ రేటు 7% లోపే

    రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముగుస్తుందని, తద్వారా వడ్డీ భారం తగ్గుతుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.

    ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు.

    గత ఏడాది జూన్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే నాటికి రుణాలు, పెండింగ్ బిల్లుల భారం కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల వరకు ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

    మొత్తం అప్పుల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా తెచ్చుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే ఉన్నాయి.

    వీటి వడ్డీ రేటు 7% లోపే ఉందని ఆర్థికశాఖ వివరించింది.అదనంగా, రూ. 2.50 లక్షల కోట్ల కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి, వీటి వడ్డీ రేటు 12-13% వరకు ఉంది.

    వివరాలు 

    వడ్డీలను తగ్గించడంపై చర్యలు 

    అలాగే, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ. 70-80 వేల కోట్ల వరకు ఉంటుందని, తక్కువ వడ్డీ రేటుతో తీసుకున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సరిగా చెల్లించకపోవడం, ఇతర కారణాలతో ఇవి 11% వరకు పెరిగిపోయాయని ఆర్థికశాఖ గుర్తించింది.

    ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల రుణాల వడ్డీ తగ్గించడం, ఇతర బ్యాంకుల వద్ద 11% వడ్డీని 9%కు తగ్గించడంపై ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

    ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ కార్యదర్శి కేంద్ర అధికారులతో చర్చించారు.

    బ్యాంకులను సంప్రదించి వడ్డీలను తగ్గించడంపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక, మారటోరియం పరిమితిని సవరిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి! పవన్ కళ్యాణ్
    Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌ భారతదేశం
    Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం భారతదేశం
    Vijaya Ghee: ఆలయాల్లో 'విజయ' నెయ్యి తప్పనిసరి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025