
Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.
ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు, పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు.
కేంద్రమంత్రులతో వరుస భేటీలు
రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు, మంగళవారం రోజంతా కేంద్ర మంత్రులతో అనేక కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాజకీయ పరిణామాలు, కూటమి వ్యవహారాలపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.
Details
రాజ్యసభ సీటు - అమిత్ షాతో కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ సీటును ఎవరికిచ్చాలనే దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరపనున్నారు.
అలాగే అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2న రానున్నారు.
ఆ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అమిత్ షాకు సీఎం వివరించనున్నట్లు సమాచారం.
Details
సీఎం చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్
ఉదయం 10:30 గంటలకు జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం
ఉదయం 11:15 గంటలకు న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ను కలవడం
మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో భేటీ
మధ్యాహ్నం 1:40కి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం
ఈ భేటీలన్నింటిలో రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా కూడా కీలకంగా మారనుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.