NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ 
    నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.

    ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు, పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రావు ఘన స్వాగతం పలికారు.

    కేంద్రమంత్రులతో వరుస భేటీలు

    రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు, మంగళవారం రోజంతా కేంద్ర మంత్రులతో అనేక కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

    ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాజకీయ పరిణామాలు, కూటమి వ్యవహారాలపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.

    Details

    రాజ్యసభ సీటు - అమిత్ షాతో కీలక చర్చలు 

    ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ సీటును ఎవరికిచ్చాలనే దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరపనున్నారు.

    అలాగే అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2న రానున్నారు.

    ఆ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అమిత్ షాకు సీఎం వివరించనున్నట్లు సమాచారం.

    Details

    సీఎం చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ 

    ఉదయం 10:30 గంటలకు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం

    ఉదయం 11:15 గంటలకు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ను కలవడం

    మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ

    మధ్యాహ్నం 1:40కి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం

    ఈ భేటీలన్నింటిలో రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.

    సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా కూడా కీలకంగా మారనుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    దిల్లీ
    కేంద్రమంత్రి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌ భారతదేశం
    Free Gas Cylinder Scheme AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ భారతదేశం
    Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు  భారతదేశం
    Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్.. కొలుసు పార్థసారథి
    AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం! చంద్రబాబు నాయుడు
    Chandrababu: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు
    Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి

    దిల్లీ

    #NewsBytesExplainer: ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖా గుప్తా ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి? భారతదేశం
    Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక భారతదేశం
    Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా  భారతదేశం

    కేంద్రమంత్రి

    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి BGMI గేమ్ రీ ఎంట్రీ గేమ్
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విద్యా శాఖ మంత్రి
    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025