NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి 
    బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన

    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    08:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో నిర్ధారితంగా శంకుస్థాపన జరిగేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

    విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి పొందేలా ప్రయత్నించాలని సూచించారు.

    గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, ఇది అమలైతే రాష్ట్రంలోని రైతులకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని ఆయన అన్నారు.

    ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని తీసుకురావడానికి ఎంపీలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

    పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు రూ.12,150 కోట్లు మంజూరు చేసిందని, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు దాని ప్రయోజనాలను అందజేస్తామని తెలిపారు.

    వివరాలు 

    సమన్వయంతో పనిచేయండి 

    పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.

    ప్రస్తుత ఎంపీల్లో చాలా మంది కొత్తవారైనా, అందరూ సమన్వయంతో బృందంగా పని చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

    ఇకపై కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

    "కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా సహాయం అందిస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా టీడీపీ కూడా అదే విధంగా సహకరించాలి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించేలా, ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించేలా ఎంపీలు కృషి చేయాలి. కొత్త రహదారులు, విస్తరణ ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు పార్లమెంటులో చొరవ తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

    వివరాలు 

    ఎంపీలు నియోజకవర్గాల్లో తిరగండి 

    రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు, ఆవిష్కరణలు,సాంకేతిక పరిజ్ఞానం,ఇతర దేశాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు,విధానాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు.

    జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు,ఎంపీలు,కలెక్టర్లు,ఎస్పీలు ఒక బృందంగా సమన్వయంతో పని చేయాలని చెప్పారు.

    "పార్లమెంటు సమావేశాలకు పూర్తి హాజరు కావాలి. మిగతా సమయంలో ఎంపీలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి.

    ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి విజన్ డాక్యుమెంట్లు రూపొందించాలి. నియోజకవర్గ నేతలతో సమన్వయంతో పని చేయాలి.

    పార్టీ కార్యక్రమాలను కలిసికట్టుగా నిర్వహించాలి. ఉపాధి హామీ వంటి పథకాలకు అనుమతులు పొందేందుకు స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపాలి" అని తెలిపారు.

    సీఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేసేటప్పుడు జీఎస్టీ రాకుండా చూడాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థించగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

    వివరాలు 

    రైల్వే ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి 

    రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని,పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా, కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

    నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నరసాపురం, కడప-బెంగళూరు వంటి ప్రాజెక్టుల కోసం తగిన నిధులు కేటాయింపునకు ఎంపీలు కృషి చేయాలని కోరారు.

    వక్ఫ్ చట్ట సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్ళడానికి టీడీపీ ఎంపీల కృషి ముఖ్యమైనదని,బిల్లులో 14 సవరణలు చేయగా, అందులో 4 టీడీపీ ప్రతిపాదించినవేనని పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.

    పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ఎంపీలలో తెదేపా ఎంపీల హాజరు శాతం దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.

    ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

    వివరాలు 

    2న దిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం 

    ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల 2న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు.

    ఢిల్లీలో ఎక్కువ మంది తెలుగువారు నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలు ఎన్డీయే తరపున ప్రచారంలో పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం! చంద్రబాబు నాయుడు
    Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం లద్దాఖ్
    Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు! కమల్ హాసన్
    Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త సంక్రాంతి
    Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లా
    Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025