NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
    ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

    Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    09:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచేందుకు, గత 30 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలకు స్పష్టం చేశారు.

    ఇందుకు డిజిటల్ టెక్నాలజీ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు.

    ప్రతి శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బృందం తప్పనిసరిగా ఉండాలనీ, పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత పన్నుల నిర్వహణ వ్యవస్థను మూడు నెలల్లోగా అమలు చేయాలని ఆదేశించారు.

    ఈ విషయాలపై మంగళవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

    వివరాలు 

    ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

    "బంగారం కొనుగోళ్లలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం తక్కువగా ఉండటం ఆలోచనీయమైంది," అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

    కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా అధిక ఆదాయం రాగా, మన రాష్ట్రంలో మాత్రం తక్కువగా ఉండటానికి కారణాలపై విశ్లేషణ చేయాలన్నారు.

    అవసరమైన చర్యలు తీసుకుని, నెలవారీ ఆదాయ లక్ష్యాలను అధిగమించేలా శాఖలు కృషి చేయాలని సూచించారు.

    అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు

    పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకురావడాన్ని పూర్తిగా అరికట్టాలని,మద్యం సరఫరా నుంచి అమ్మకం వరకూ ప్రతి దశను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఉండాలనీ,రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు.

    వివరాలు 

    కేంద్రం సహాయం ప్రాథమికం మాత్రమే 

    కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం,అప్పులు తాత్కాలికంగా ఉపయోగపడతాయని,దీని ద్వారా వాస్తవ అభివృద్ధిని సాధించలేమని సీఎం స్పష్టం చేశారు.

    కొన్ని శాఖలు ఒక్క ఏడాది వ్యవధిలో కూడా ఆశించిన పురోగతిని సాధించలేకపోయాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఎర్రచందనం వ్యాపారంపై ప్రత్యేక కమిటీ

    రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన ఎర్రచందనం వనరులపై దృష్టి పెట్టాలన్నారు.

    రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలపై ఖచ్చితమైన లెక్కలు వేసి, వాటి విలువను అంచనా వేసి, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    వివరాలు 

    2025-26 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం - రూ.1.34 లక్షల కోట్లు 

    వాణిజ్య పన్నులు,ఎక్సైజ్‌, స్టాంపులు,రిజిస్ట్రేషన్, గనులు, అటవీ శాఖల ద్వారా వచ్చే అన్ని ఆదాయాలను కలిపి, రాష్ట్రం 2025-26 సంవత్సరానికి రూ.1,34,208 కోట్లు స్వంత ఆదాయం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

    ఇది గత సంవత్సరంతో పోల్చితే సుమారు 29 శాతం అధికమని తెలిపారు.

    అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు వాణిజ్య పన్నులు, అటవీ శాఖల ఆదాయం తగ్గగా, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పెరిగిందని వివరించారు.

    ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.12,717 కోట్లు మాత్రమే అందాయని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.17,170 కోట్లు వచ్చిన నేపథ్యంలో ఇది 29 శాతం తక్కువగా ఉందని తెలిపారు.

    వివరాలు 

    ఎక్సైజ్‌ పాలసీతో ఆదాయం వృద్ధి 

    రాష్ట్రంలో అమలు చేసిన కొత్త ఎక్సైజ్‌ పాలసీ వల్ల ఆదాయంలో స్పష్టమైన వృద్ధి నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

    గత నెలలో ఒక్కటే రూ.2,116 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 2024-25 సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం రూ.28,842 కోట్లకు చేరిందని, ఇది గత సంవత్సరంతో పోల్చితే 14.84 శాతం అధికమని వివరించారు.

    ఈ ఏడాదికి మొత్తం ఎక్సైజ్‌ ఆదాయాన్ని రూ.33,882 కోట్లు గా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

    అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్‌ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉందని వారు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు చంద్రబాబు నాయుడు
    YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం వైసీపీ
    Hyderabad Metro:మెట్రో రెండోదశ మలిభాగం 19వేల కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి  మెట్రో రైలు
    Gold From Lead: సీసంను బంగారంగా మార్చటం సాధ్యమని నిరూపించిన సెర్న్‌ శాస్త్రవేత్తలు  శాస్త్రవేత్త

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్‌ పోస్టుల భర్తీ భారతదేశం
    CM Chandrababu: ఆర్థిక భారం పెరిగింది.. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు: సీఎం చంద్రబాబు చిత్తూరు
    CM Chandrababu: భూకబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి  భారతదేశం
    Shakti App: 'శక్తి' యాప్‌ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025