NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం
    మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

    CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2025
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

    ఈ సమస్యకు రాజకీయ రంగు కూడా పులమడంతో పాలక, ప్రతిపక్ష నాయకుల ఎంట్రీ మరింత హాట్ టాపిక్‌గా మారింది.

    ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

    ఈ ఏడాది మిర్చి ధరల పతనంపై చర్చించి, అవసరమైన చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

    Details

    గిట్టుబాటు ధర అందించేలా చర్యలు

    ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరిగింది. మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండగా, ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేశారు.

    మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు గిట్టుబాటు ధర అందించేలా ప్రభుత్వం చొరవ చూపనుంది.

    రాజకీయంగా మారుతున్న మిర్చి ధరల వివాదం

    ఎప్పుడూ లేనంతగా మిర్చి ధరలు పడిపోవడం రైతులను ఆందోళనలో ముంచేసింది. దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఊపందుకున్నాయి.

    రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేపు ప్రభుత్వం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో సమావేశమై ధరల పతనానికి గల అసలైన కారణాలను విశ్లేషించనుంది.

    Details

    రైతుల్లో ఉత్కంఠ

    రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మిర్చి రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

    వ్యవసాయ రంగానికి మద్దతుగా, రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    ఆంధ్రప్రదేశ్

    APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి భారతదేశం
    AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ భారతదేశం
    AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు  వాతావరణ మార్పులు
    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం.. 1,600 మంది పేదలకు లబ్ధి భారతదేశం
    Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కుప్పం
    Chandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భారతదేశం
    CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక కుప్పం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025