NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి
    తదుపరి వార్తా కథనం
    మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి
    సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

    మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

    ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ (CEO) రాజ్‌కుమార్ సింగ్‌ అపహరణకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

    మరోవైపు ఈ కిడ్నాప్ కేసులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే కుమారుడు రాజ్ సర్వే నిందితుడిగా ఉండటంపై రాజకీయ దుమారం రేగుతోంది.

    సర్వేతో పాటు మరికొంత మందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

    వ్యాపారవేత్త రాజ్‌కుమార్‌ సింగ్ పై ఎమ్మెల్యే తనయుడు తుపాకి ఎక్కుపెట్టి అతన్ని భయబ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ విషయాన్ని బయట ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించినట్లు చెప్పారు.

    DETAILS

    డీల్ సెటిల్ చేసుకోవాలని బెదిరించారు : బాధితుడు రాజ్‌కుమార్‌ సింగ్

    మ్యూజిక్ కంపెనీ ఉన్నతాధికారి రాజ్‌కుమార్‌ ను బలవంతంగా బయటకు తరలించినట్లు సీసీటీవీ(CCTV) కెమెరాల్లోని దృశ్యాలు బట్టబయలు చేశాయి.

    దాదాపు 10 నుంచి 15 మంది వరకు ముంబై గోరేగావ్‌లోని గ్లోబల్ మ్యూజిక్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన నిందితులు, సదరు కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేశారు.

    అంతుకుముందు కార్యాలయ సిబ్బందితోనూ ఘర్షణకు దిగినట్లు ఫుటేజీలో స్పష్టమైంది.

    అపహరణ అనంతరం దహిసార్‌లోని ఎమ్మెల్యే సర్వే కార్యాలయానికి తరలించారని, అక్కడ శాసనసభ కుమారుడు తనను తుపాకీతో బెదిరించినట్లు రాజ్‌కుమార్‌ వాపోయారు.

    పాట్నాకు చెందిన మనోజ్ మిశ్రాకు తనతో ఉన్న వ్యాపార లావాదేవీలు, బకాయిల వ్యవహారం నేపథ్యంలోనే ఈ అపహరణ చోటు చేసుకున్నట్లు బాధితుడు చెప్పారు.

    వెంటనే డీల్ ను క్లోజ్ చేసుకోవాలని భయబ్రాంతులకు గురిచేసినట్లు ఆయన ఆందోళన చెందుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    కిడ్నాప్
    ముఖ్యమంత్రి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    మహారాష్ట్ర

    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  కొల్లాపూర్
    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు  ముంబై
    ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ  ముంబై
    ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం  శరద్ పవార్

    కిడ్నాప్

    Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు జమ్ముకశ్మీర్

    ముఖ్యమంత్రి

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత  పంజాబ్
    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  మణిపూర్
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025