NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
    ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి

    Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 30, 2025
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.

    ఈ పథకాన్ని ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

    లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు.

    Details

     సీఎం రేవంత్‌ హుజూర్‌నగర్ పర్యటన

    ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు.

    అక్కడ ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. అనంతరం నేరుగా బహిరంగ సభాస్థలికి వెళ్లి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు.

    పేదల కోసం ఉచిత సన్న బియ్యం పథకం

    ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 84 శాతం పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించనున్నారు.

    ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

    ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనుంది.

    Details

    ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం 

    ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది.

    పేదలకు సన్న బియ్యం అందించేందుకు ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.

    దీనికోసం ప్రభుత్వం ఏడాదిలో రెండు సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయనుంది.

    Details

     లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం 

    ప్రస్తుతం తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా, వీటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రతను మరింత పటిష్ఠంగా అందించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రేవంత్ రెడ్డి

    Prabhas: 'డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' .. రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో! ప్రభాస్
    Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ  కాంగ్రెస్
    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన నరేంద్ర మోదీ
    Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: రేవంత్‌రెడ్డి  భారతదేశం

    తెలంగాణ

    TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలతో దర్శనానికి కొత్త నిబంధనలు టీటీడీ
    Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా? భారతదేశం
    Sudheer Reddy: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బీఆర్ఎస్
    Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025