NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన

    Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    01:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

    ఈ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

    రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రిని ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రిని రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. 2,000 పడకల సామర్థ్యంతో 30 వైద్య విభాగాల సేవలను అందించనున్నారు.

    మొత్తం 26.30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగనుంది.

    వివరాలు 

    గోషామహల్ పరిరక్షణ సమితి బంద్‌కు పిలుపు

    అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    అయితే, గోషామహల్ పరిరక్షణ సమితి ఈ ఆస్పత్రి నిర్మాణానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది.

    ఆస్పత్రి నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని సమితి అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది.

    గోషామహల్‌లో కాకుండా ఇతర ప్రదేశంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరుతోంది.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన రోజునే సమితి బంద్‌కు పిలుపునిచ్చింది, దీనితో పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి  తెలంగాణ
    yadagirigutta: ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్ట: రేవంత్ రెడ్డి  యాదాద్రి
    CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం  తెలంగాణ
    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025