Page Loader
Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన
నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామానికి చేరుకోనున్నారు. ఈ సందర్శనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ముఖ్య ప్రాజెక్టులలో ఒకటైన 'ఇందిరా గిరి జల వికాస పథకం'ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, చెంచు గిరిజనులకు ప్రాధాన్యం ఇస్తూ, 23 మంది గిరిజన రైతులకు ఉచితంగా సౌర ప్యానెళ్లు, సోలార్ పంప్ సెట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనకు ముందు,సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈకార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధికి వేగం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

వివరాలు 

గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి

ఇందిరా గిరి జల వికాస పథకం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టులలో ఒకటి. ఈ పథకం ముఖ్యంగా గిరిజన రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయం కోసం అవసరమైన నీటిని సమకూర్చడం లక్ష్యంగా తీసుకున్నారు. ROFR (Right of Forest Rights) పట్టాలు కలిగిన గిరిజనులు ఈ పథకం నుండి లబ్దిపొందే అవకాశం కలిగినవారిగా గుర్తించబడ్డారు. ఈపథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు 2.10లక్షల మంది గిరిజన రైతులకు మేలు చేకూరేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. మొత్తం 6లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలన్నదే ఈ పథకం ప్రధాన లక్ష్యం.దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమే కాక,జీవన ప్రమాణాలను కూడా మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.