NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి
    అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి

    CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూపు విరాళాలపై కీలక నిర్ణయం తీసుకుంది.

    అదానీ సంస్థపై లంచాల ఆరోపణల నేపథ్యంలో, స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ గ్రూపు ప్రకటించిన ₹100 కోట్లు స్వీకరించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

    ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో వెల్లడిస్తూ, విమర్శల కారణంగా అదానీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

    ఈ మేరకు అదానీ గ్రూపుకు లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు.

    వివరాలు 

    ప్రభుత్వంపై అనవసర వివాదాలు వద్దు 

    ''అదానీ గ్రూపు గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందనే విమర్శలు వస్తున్నాయి. కానీ, రాజ్యాంగబద్ధంగా,చట్టబద్ధంగా అన్ని సంస్థల నుంచీ పెట్టుబడులు అనుమతిస్తాం. టెండర్ల ప్రక్రియను నిబంధనల మేరకే అమలు చేస్తాం. అంబానీ, అదానీ, టాటా వంటి కంపెనీలకు తెలంగాణలో వ్యాపార హక్కులు ఉన్నాయి.

    స్కిల్స్ యూనివర్సిటీ లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పడం కోసం ప్రారంభించాం.కానీ ఈ యూనివర్సిటీ వివాదాలకు లోనవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.

    అదానీ గ్రూపు ప్రకటించిన ₹100 కోట్లు సీఎస్‌ఆర్‌ కింద స్కిల్స్ యూనివర్సిటీకి ఇవ్వొద్దని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసాము.

    అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగొద్దని స్పష్టంగా చెప్పాం. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదు'' అని సీఎం తెలిపారు.

    వివరాలు 

    దిల్లీ పర్యటనపై వివరణ 

    ''నేటి దిల్లీ పర్యటనకు రాజకీయ సంబంధం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాం. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం ఎంపీలతో చర్చిస్తాం. రేపు కేంద్ర మంత్రులతో రాష్ట్ర సమస్యలపై సమావేశం అవుతాం. దిల్లీ పర్యటనలపై విమర్శలు వస్తున్నాయి, కానీ నేను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిల్లీకి వెళ్లడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి సహకారం పొందడమే మా లక్ష్యం. అవసరమైతే దిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాం'' అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రేవంత్ రెడ్డి

    Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు  తెలంగాణ
    New Ration Cards: కొత్త రేషన్‌ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!  భారతదేశం
    Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట.. మాజీ మంత్రి అభ్యర్ధనకు నిరాకరణ సుప్రీంకోర్టు
    Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025