NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు 
    తదుపరి వార్తా కథనం
    CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు 
    నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు

    CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో యువతకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

    'తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'ని దేశంలోనే అత్యున్నత నైపుణ్య సంస్థగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.

    ఈ యూనివర్సిటీ బాధ్యతలను ప్రత్యేక బోర్డుకు అప్పగించారు. రాష్ట్రంలోని పరిశ్రమల ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమై, నైపుణ్య విశ్వవిద్యాలయంపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

    పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరులను అందించేందుకు ఈ యూనివర్సిటీ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.

    ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలం, రూ.100 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

    వివరాలు 

    పెరిగిన ఉపాధి అవకాశాలు

    సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "డిగ్రీలు, పీజీలు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం యువత సమస్యగా మారింది. పరిశ్రమల అవసరాలకు సరిపడే నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి" అని తెలిపారు.

    యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి పరిశ్రమల సహకారం అవసరమని, భవనాల పేర్లు పరిశ్రమల పేర్లతో పెట్టాలని సూచించారు.

    యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ

    సిఎం తన తదుపరి ప్రణాళికల్లో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' స్థాపనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

    దాదాపు 200 ఎకరాల స్థలంలో ఈ యూనివర్సిటీ నిర్మించబడుతుందని, 2028 ఒలింపిక్స్‌కు బంగారు పతకం సాధించడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

    వివరాలు 

    హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడం..

    ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ' ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన చెప్పారు.

    యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, తెలంగాణలో నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించవచ్చని అభిప్రాయపడ్డారు. "సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత దార్శనికత కలిగిన నాయకుడు" అని పొగిడారు.

    బోర్డు ప్రతినిధులు ఈ ఏడాది నుంచే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత హెల్త్‌కేర్, ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లో కోర్సులు నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    CV Anand: హైద‌రాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం  హైదరాబాద్
    Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ ఖమ్మం
    Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు ఖమ్మం
    Kaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025