NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్‌ ఆఫర్‌.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్‌ ఆఫర్‌.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు
    ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్‌ ఆఫర్‌.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు

    Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్‌ ఆఫర్‌.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 06, 2025
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశాల్లో ఉన్నత విద్యలో చదువుకోవాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కలలకు ఊతమిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేస్తోంది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన విదేశీ విద్య పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల విద్యార్థులకు విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చదివేందుకు ఆర్థిక సాయం అందించనున్నారు.

    ఈ పథకాన్ని 'అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి'గా గుర్తిస్తూ అధికారులు ఇప్పటికే మార్గదర్శక ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

    Details

    ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే

    ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలతో పాటు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద రూ.5 లక్షలు

    బీసీ, మైనారిటీ వర్గాలకు రూ.20 లక్షలు

    ఈబీసీ, కాపు వర్గాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

    ఈ పథకం 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం కాలంలో అంబేడ్కర్, ఎన్టీఆర్ పేర్లతో విజయవంతంగా అమలయ్యింది.

    Details

    విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం

    అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా మలచి, కఠిన నిబంధనలు విధించింది.

    ముఖ్యంగా కేవలం క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో టాప్‌-50 వర్సిటీల్లో ప్రవేశం పొందినవారికే లభించేలా చేసిన ఈ నిబంధనల వల్ల చాలా మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు.

    ఇప్పుడిక తాజా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, క్యూఎస్‌ ర్యాంకింగ్‌ టాప్‌-250 వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకూ ఆర్థిక సాయం అందేలా ప్రతిపాదనలు రూపొందించారు.

    దీని వల్ల విస్తృతంగా విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆంధ్రప్రదేశ్

    AP Mega DSC 2025: నేడు ఏపీలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే? భారతదేశం
    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! తెలంగాణ
    Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్! భారతదేశం
    Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025