NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
    తదుపరి వార్తా కథనం
    Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
    సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

    Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 02, 2024
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్‌ పార్టీ సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురీ బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్‌ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది.

    ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా సోమవారం దిల్లీలో మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

    ఆయన పేర్కొన్న విధంగా, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, ప్రజా సేవల్లో నైతికత,జవాబుదారీతనానికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు.

    పవన్‌ ఖేడా అభిప్రాయాన్ని బలోపేతం చేస్తూ, ఒక వ్యక్తి ఒకే చోట మాత్రమే వేతనం పొందాల్సిన నిబంధన ఉందని, కానీ మాధబి పురీ బుచ్‌ సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉండి కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రుడెన్షియల్‌ సంస్థల నుండి వేతనం పొందినట్లు ఆరోపించారు.

    వివరాలు 

    ఏడు సంవత్సరాలలో సుమారు రూ.16 కోట్లకు పైగా వేతనం

    అదేవిధంగా, 2017-2024 మధ్యకాలంలో ఆమె ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లు కూడా పొందారని తెలిపారు. ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

    మాధబి పురీ బుచ్‌ 2017 నుండి సెబీ సభ్యురాలిగా కొనసాగుతూ, 2022లో సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని పవన్‌ వెల్లడించారు.

    గత ఏడు సంవత్సరాలలో ఆమె సుమారు రూ.16 కోట్లకు పైగా వేతనం పొందినట్లు ఆయన ఆరోపించారు.

    సెబీ చీఫ్‌గా కొనసాగుతూ, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుండి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

    ఈ వ్యవహారంపై బయట వ్యక్తుల ప్రభావం పడకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కాంగ్రెస్

    Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా? బీజేపీ
    Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం  మహారాష్ట్ర
    Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025