LS polls: కడప నుంచి వైఎస్ షర్మిల.. 17మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
2024 లోక్సభ ఎన్నికలకు 17 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది. జాబితా ప్రకారం, రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప స్థానం నుండి వైఎస్ షర్మిల రెడ్డిని పార్టీ పోటీకి దింపింది. ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల బంధువైన అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ లో చేరారు. ఆ వెంటనే పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి కొత్త అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ నుంచి అభ్యర్థిగా డాక్టర్ మునీష్ తమాంగ్ను కూడా పార్టీ ప్రకటించింది.