NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Constitution Debate: రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు 
    తదుపరి వార్తా కథనం
    Constitution Debate: రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు 
    రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు

    Constitution Debate: రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో వచ్చే వారం లోక్‌సభ, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరగేందుకు ఎంపీలందరూ అంగీకరించారు.

    ఇవాళ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.

    సమావేశం అనంతరం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు రాజ్యాంగ చర్చ తేదీలను ప్రకటించారు.

    లోక్‌సభలో డిసెంబర్ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరగనుందని ఆయన స్పష్టం చేశారు.

    చర్చ అనంతరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగంపై ప్రసంగించనున్నారు.

    వివరాలు 

    చర్చలు జరగకపోవడంతో విపక్షాల ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం

    పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు.

    ఉభయసభల్లో వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్చలు జరగకపోవడంతో విపక్షాల ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్ ఘటన, అజ్మేర్ ఘటన, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఇవి చర్చించాలనే ఆసక్తి లేదని వారు విమర్శిస్తున్నారు.

    దీంతో పాటు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని, రెండు రోజులపాటు ప్రత్యేకంగా రాజ్యాంగంపై చర్చ చేపట్టాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

    అయితే, ఈ చర్చ ఎప్పుడు జరగుతుందనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    పార్లమెంట్

    Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ దిల్లీ
    PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?  నరేంద్ర మోదీ
    MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు లోక్‌సభ
    Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025