NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Year Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
    తదుపరి వార్తా కథనం
    Year Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
    ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు

    Year Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సంవత్సరం ముగింపుకు చేరువగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా, ఈ ఏడాది మన దేశానికి ఎన్నో చేదు సంఘటనలను మిగిల్చింది.

    ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు భయానక విజృంభణతో దేశంలోని ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

    వివరాలు 

    వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం

    2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 397 మంది గాయపడగా, 47 మంది గల్లంతయ్యారు. 1,500 ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసమవ్వగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

    రెమాల్ తుఫాను తాకిడి

    2024, మే 26న ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సుందర్‌బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను 33 మంది ప్రాణాలను బలిగొంది. బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ విధ్వంసం సంభవించింది.

    వివరాలు 

    ఫెంగల్ తుఫాను ప్రభావం

    2024, నవంబర్ 30న పుదుచ్చేరి తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాను 19 మంది ప్రాణాలను బలిగొంది. పుదుచ్చేరిలో 46 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తుఫాను భారీ నష్టాన్ని కలిగించింది.

    విజయవాడ వరదలు

    2024, ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9 వరకు విజయవాడలో వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, నదుల ఉప్పొంగడతో 45 మంది ప్రాణాలు కోల్పోగా, 2.7 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.

    వివరాలు 

    హిమాచల్ ప్రదేశ్ వరదలు

    2024, జూన్-ఆగస్టు మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు భయంకర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ విపత్తులో 31 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లగా, 121 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం తెచ్చింది.

    అస్సాం వరదలు

    2024లో అస్సాంలో వరదల కారణంగా 117 మంది ప్రాణాలు కోల్పోగా, జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా వరదలతో తీవ్రంగా బాధపడుతున్న అస్సాంలో ఈ సంవత్సరం పరిస్థితి మరింత దారుణంగా మారింది.

    ఈ ఘటనలు 2024 సంవత్సరం మన దేశ చరిత్రలో తీవ్రంగా ముద్ర వేశాయి. ఈ సంవత్సరం కష్టాలను మర్చుకుని, రాబోయే 2025కు ఆశాజనకమైన కొత్త ప్రారంభం ఆశిద్దాం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..! టెక్నాలజీ
    Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..? సినిమా
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్
    Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా? యూట్యూబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025