NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం
    తదుపరి వార్తా కథనం
    Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం
    పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం

    Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాలలో భారీ గందరగోళం ఏర్పడింది.

    ఈ ఘటనతో విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు. పిల్లల ఆహారంలో బల్లి కన్పించడం మీద తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు జిల్లా అధికారులను చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే పిల్లల భోజనం నాణ్యతపై తల్లిదండ్రుల పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదులను చేశారని తెలిపారు.

    బహదుర్‌గంజ్ నగరంలోని పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారం జన జాగృతి ఏజెన్సీ ద్వారా అందించబడుతుంది.

    అయితే,ఆహారంలో బల్లి కనిపించడం ఆ ఏజెన్సీకి సంబంధించిన నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.గత నెలలో కూడా,కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

    వివరాలు 

    ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణ చేపట్టాలి.. తల్లితండ్రుల డిమాండ్  

    తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ తుషార్ సింగ్‌గ్లాను విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    పాఠశాల ఇన్‌చార్జ్ జాఫర్‌ఆలం తెలిపినట్లుగా, పిల్లల భోజన నాణ్యతపై అనేకసార్లు ఫిర్యాదులు అందాయి.అయినా,ఎన్జీవో ఉద్యోగులు నాణ్యత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పరిస్థితి యధావిథిగానే కొనసాగుతోంది.

    ఈ రోజు మధ్యాహ్న భోజనంలో బల్లి కనబడటంతో, వెంటనే బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రేణుకుమారి, స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు.

    అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల అధ్యక్షుడు షాబాజ్ అన్వర్ అల్లియాస్ ఛోటే,నగర పంచాయతీ ప్రెసిడెంట్ ప్రతినిధి వశికుర్ రెహమాన్ ఈ పరిస్థితి తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని తెలిపారు.

    వారు ఆహార సరఫరా ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోతే, తాము ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    బిహార్

    land-for-jobs case: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్ మంజూరు  భారతదేశం
    Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష  భారతదేశం
    Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం  భారతదేశం
    Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు  అవిశ్వాస తీర్మానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025