NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత 
    Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత

    Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 07, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కర్ణాటక డీఐపీఆర్ తెలిపారు.

    మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముదిగెరెలోని అడ్యంతయ రంగమందిరంలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి బుధవారం (నవంబర్ 8) ఆయన ఎస్టేట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బైరేగౌడ ఆగష్టు 26, 1936న జన్మించారు. ఆయన సన్నిహితులు ఆయనను DBC అని పిలిచేవారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన, బైరేగౌడ న్యాయవాదిగా పనిచేశారు. 1971లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

    Details 

    చిక్కమగళూరులో ఇందిరా గాంధీకోసం రాజీనామా

    D B చంద్రేగౌడ మొట్టమొదటగా 1971లో చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు, 1977లో రెండోసారి ఎన్నికయ్యారు.

    1978లో ఇందిరా గాంధీని చిక్కమగళూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన రాజీనామా చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు.

    లోక్‌సభ ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై 1979-80 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1980-81 మధ్య కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు.

    డి బి చంద్రే గౌడ 1983లో తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ నుండి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అయన 1983-85 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు.

    Details 

    2014 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరం

    1986లో జనతా పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1987లో రెండోసారి తీర్థహళ్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

    1999లో శృంగేరి నియోజకవర్గం నుండి, 1999,2004 మధ్య న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

    డిబి చంద్రే గౌడ 2009లో బీజేపీలో చేరి బెంగుళూరు నార్త్ నుండి లోక్‌సభ స్థానానికి గెలుపొందారు. 2014 నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    కర్ణాటక

    ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక  బెంగళూరు
    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం  చంద్రయాన్-3
    Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్
    లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025