NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
    తదుపరి వార్తా కథనం
    Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
    ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే

    Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 03, 2024
    08:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకీ అధికమవుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.

    ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు, ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించింది.

    ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 500 పాయింట్లను దాటడంతో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

    ఈ పరిస్థితి కారణంగా ఢిల్లీలో దట్టమైన పొగ మంచు ఏర్పడి, విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    వివరాలు 

    ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతున్న విధానం 

    వైద్య నిపుణుల ప్రకారం, ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిగణిస్తారు.

    ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి ఇది 65 రెట్లు అధికం కావడం గమనార్హం.

    శనివారం రాత్రి 9 గంటలకు 327 పాయింట్ల వద్ద ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో 500 పాయింట్లకు పైగా పెరగడం ఢిల్లీ ప్రజలను కలవరపరుస్తోంది.

    వాతావరణంలో ఉన్న ఈ కాలుష్య కారకాల వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి సమస్యలు, గొంతు ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

    ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఇలా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్

    దిల్లీ

    AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..! ఎన్నికల సంఘం
    Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన అరవింద్ కేజ్రీవాల్
    Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025