NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 
    తదుపరి వార్తా కథనం
    Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 
    గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు

    Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఒకవైపు కాలుష్య ప్రభావం తీవ్రత ఎక్కువవుతుండగా, మరోవైపు నగరాన్ని గడ్డకట్టే మంచు దుప్పటి కప్పేసింది.

    దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటింది.

    ఈ పరిస్థితుల కారణంగా ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌గా మారిందని ప్రజలు చెబుతున్నారు.

    ప్రజలు ఎక్కువగా ఆరుబయట ఉన్నప్పుడు ఛాతిలో మంట, కళ్లలో మంట వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

    వివరాలు 

    గాలి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం

    సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, గురువారం ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్ ఏక్యూఐ 405గా, ముండ్కాలో 413, బవానాలో 418, అశోక్ విహార్‌లో 414, ఐటీవోలో 355, జహంగీర్‌పురిలో 435, రోహిణిలో 407గా నమోదయ్యింది.

    నజాఫ్‌గఢ్‌లో 366, ఆర్‌కేపురం 387, పంజాబీ బాగ్ 407, సోనియా విహార్ 394, ద్వారకా సెక్టార్-8లో 401 ఏక్యూఐతో రికార్డయింది.

    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM)తెలిపిన వివరాల ప్రకారం,నగరంలో వాయువ్య దిశనుంచి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అంచనా వేసింది.

    శుక్ర,శనివారాల్లో గాలుల ప్రభావం కొనసాగుతుందని,ఈ సమయంలో దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని పేర్కొంది.

    దాంతో,గాలి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    వివరాలు 

    రాబోయే ఐదు రోజుల్లో దట్టమైన పొగమంచు

    ఎన్‌సీఆర్ పరిధిలో గాలి విషపూరితంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ప్రభుత్వ శాఖలలో 50% ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

    ఢిల్లీ ప్రభుత్వంలోని 80 విభాగాలు, ఇతర ఏజెన్సీలు కలిపి దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తింపజేసింది.

    అలాగే, గురుగ్రామ్ ప్రాంతంలోని ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

    కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్, సోనిపట్, ఫరీదాబాద్ నగరాల్లో పాఠశాలలు మూసివేశారు.

    రాబోయే ఐదు రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    వివరాలు 

    తక్షణ చర్యలు 

    వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం మరింత కృషి అవసరమని నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్ భారతదేశం
    Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత ఇండియా
    Fire accident: దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది అగ్నిప్రమాదం
    Air Pollution: ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025