NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌
    దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌

    Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఉదయం నుంచి 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ)-4' కింద మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి.

    ఈ పరిధిలో, ఢిల్లీకి ట్రక్కుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. నిత్యావసర సరుకులను తీసుకువెళ్లే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

    ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్‌-4 ప్రమాణాలకు తగిన డీజిల్‌ ట్రక్కులకి మాత్రమే రాకపోకల కోసం అనుమతిని ఇస్తారు.

    వివరాలు 

    కాలుష్యంపై ఆందోళన 

    ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    ఈ క్రమంలో అన్ని రకాల నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

    హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌లు, వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లతో సహా అన్ని నిర్మాణ ప్రాజెక్టులను తక్షణం ఆపాలని స్పష్టం చేసింది.

    అదనంగా, సరి-బేసి వాహన నిబంధనల అమలుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

    వివరాలు 

    పొగమంచు ప్రభావం.. విమానాలు రద్దు 

    కేవలం కాలుష్యంతోనే కాకుండా, దట్టమైన పొగమంచు కూడా పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.

    దాని ప్రభావంతో వాహనాలు కనపడని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం ఇంతటి తీవ్రస్థాయికి చేరడంతో, ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలు రద్దు చేయగా, 107 విమానాలు ఆలస్యమయ్యాయి.

    విద్యా, కార్యాలయాలపై ప్రభావం

    సీఏక్యూఎం సూచనల మేరకు, ఇప్పటికే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

    తాజా ఆదేశాల ప్రకారం, ఆన్‌లైన్ తరగతులను 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు కూడా విస్తరించాలని నిర్ణయించారు.

    దీంతో, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ మోడ్‌లో కొనసాగాలని ఢిల్లీ సీఎం అతిషి మార్లెనా విద్యాశాఖను ఆదేశించారు.

    వివరాలు 

    50% సామర్థ్యంతో కార్యాలయాలు 

    ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు 50% సామర్థ్యంతో పని చేయాలని, మిగిలిన సిబ్బందిని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో కొనసాగించాలని సీఏక్యూఎం సూచించింది.

    ఈ నిబంధనలతో కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల భాగస్వామ్యంతో ఈ చర్యలు మరింత ఫలవంతం కావాలని ఆశిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    CM Chandrababu: వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్రంతో కీలక సమావేశం.. ఇవాళ దిల్లీకి చంద్రబాబు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇండియా
    Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్ ఇండియా
    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025