NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
    ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!

    Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైంది. హస్తినలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

    ఈ క్రమంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందస్తుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

    కొత్త పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

    ఈ నేపథ్యంలో, బీజేపీ కూడా ఎన్నికల సమరానికి సిద్దమవుతుందని తెలుస్తోంది.

    శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించి, మురికివాడ ప్రజలకు ఇళ్లు పంపిణీ చేశారు. ఇది బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రారంభమని భావిస్తున్నారు.

    వివరాలు 

    ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలవని ఆప్ 

    ఇక, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుండగా, వీరేంద్ర సచ్‌దేవా తన అభిప్రాయాన్ని హైకమాండ్‌కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఫిబ్రవరి నాటికి ఢిల్లీ ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

    2015 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.

    అయితే, 2014 నుంచి ఇప్పటివరకు ఆప్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

    మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య తీవ్రమైన పోరు జరగనుందని అంచనా.

    వివరాలు 

     కేజ్రీవాల్‌ లక్ష్యంగా బీజేపీ పోస్టర్ యుద్ధం 

    ఇప్పటికే బీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధం మొదలుపెట్టింది.

    కేజ్రీవాల్‌ను "చాలా రిచ్" అంటూ పోస్టర్లు విడుదల చేయడమేగాక, ఆప్ అధికారంలో కొనసాగేందుకు ఓటర్లను మోసం చేస్తోందని ఆరోపించింది.

    జనవరి 1న, బీజేపీ చీఫ్ దేవేంద్ర కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ, అబద్ధాలు, మోసం చేయడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు.

    మద్యం ప్రోత్సహించినందుకు ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    బీజేపీ, ఆప్ మధ్య పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయి. ఆప్ ఓటర్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించగా, ఆప్ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

    ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బీజేపీ

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    దిల్లీ

    Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..! ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా భారతదేశం

    బీజేపీ

    Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్! మహారాష్ట్ర
    Rahul Gandhi: యూఎస్‌లో రాహుల్ గాంధీ-ఇల్హాన్ ఒమర్ భేటీ.. దేశవ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అని బీజేపీ విమర్శలు రాహుల్ గాంధీ
    Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర' రాహుల్ గాంధీ
    Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025