NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం 
    తదుపరి వార్తా కథనం
    Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం 
    'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం

    Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    02:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం 'రేవారీ పే చర్చా' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో ఆయన ఆప్ అందించిన ఆరు ముఖ్య రేవారీలను వివరించారు. అలాగే, ఢిల్లీలో బీజేపీ పాలన వస్తే జరిగే అనర్థాలను స్పష్టంగా ప్రస్తావిస్తూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు.

    వివరాలు 

    బీజేపీపై తీవ్ర విమర్శలు 

    కేజ్రీవాల్ ప్రకారం, బీజేపీ పాలనలో ఉన్న 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ సరఫరా లేదు.

    అయితే, ఢిల్లీలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వల్లే సాధ్యమైందని తెలిపారు.

    గుజరాత్‌లో 30 ఏళ్లుగా ప్రభుత్వం నడిపినా, 24 గంటల కరెంట్ అందించడం వీరికి సాధ్యపడలేదని ఆరోపించారు.

    ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా బీజేపీకి ఓటేస్తే, నగరంలో రోజుకు 8 నుంచి 10 గంటల కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు.

    వివరాలు 

    రేవారీల ద్వారా ప్రజలకు సేవలు 

    కేజ్రీవాల్ ప్రకటించిన ఆరు రేవారీలను హైలైట్ చేస్తూ, అవి ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఎంత ముఖ్యమో వివరించారు. ఆరు రేవారీల వివరణ:

    1. ఉచిత విద్యుత్: ఢిల్లీలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ఉచితంగా అందించడం.

    2. ఉచిత నీరు: ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించడం. 3.అద్భుతమైన విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా మరియు నాణ్యమైన విద్యను అందించడం.

    4.మొహల్లా క్లినిక్స్: ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచేందుకు సమర్థమైన మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేయడం.

    5. మహిళలకు ఉచిత ప్రయాణం: మహిళలకు నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించడం.

    6. వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర: పెద్దల కోసం ఉచితంగా యాత్ర ప్రణాళికను ప్రవేశపెట్టడం.

    వివరాలు 

    ప్రజలకు కేజ్రీవాల్ సందేశం 

    విద్యుత్ కోతలతో బాధపడే స్థితి రావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని చురకలు అంటించిన కేజ్రీవాల్, ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియజేయాలంటూ ప్రజలను కోరారు.

    "కమలం బటన్ నొక్కేముందు దీని ఫలితాల గురించి ఆలోచించండి. మీకు మేలుచేయాలనుకుంటే చీపురు బటన్ నొక్కండి," అంటూ ప్రజలను ప్రేరేపించారు.

    ఆప్ విజయానికి ఆశలు

    ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గత పదేళ్లుగా విజయవంతమైన పాలన కొనసాగిస్తూ, ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్య సేవలతో ప్రజల మనసులు గెలుచుకుంది.

    తాజా ఎన్నికల్లో కూడా ప్రజలు ఆప్‌కు మద్దతు ఇచ్చి ఈ సేవలను కొనసాగిస్తారని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇవాళైనా మోక్షం దక్కుతుందా ? సుప్రీంకోర్టు
    Arvind Kejriwal :ఢిల్లీ ముఖ్యమంత్రికి దొరకని ఉపశమనం.. రెండు రోజుల తర్వాతే విచారణ అన్న సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు
    Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టు నుంచి కేజ్రీవాల్‌కు లభించని ఉపశమనం.. బెయిల్‌పై స్టే  భారతదేశం
    Arvind Kejriwal: చిక్కుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి..విచారణకు ముందే కేజ్రీవాల్‌ అరెస్టు? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025