NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం 
    తదుపరి వార్తా కథనం
    Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం 
    కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం

    Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 31, 2024
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

    కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

    కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని, కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా సూచనలు తీసుకుంటామని ఆప్‌ నేత, మంత్రి అతిషి మార్లెనా తెలిపారు.

    వివరాలు 

    ఇప్పటి వరకు 30 బేస్‌మెంట్లను సీజ్ చేశారు 

    ఎంసీడీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బేస్‌మెంట్లలో నడుస్తున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

    రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్, ప్రీత్ విహార్‌లలో ఇప్పటివరకు 30 బేస్‌మెంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

    పలు కోచింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    వివరాలు 

    ఘోర ప్రమాదం ఎలా జరిగింది? 

    ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో శనివారం సాయంత్రం వర్షం తర్వాత నీరు నిండిపోవడంతో ప్రమాదం జరిగింది.

    ఈ క్రమంలో కోచింగ్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.

    ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.

    కోచింగ్‌ సెంటర్‌ యజమాని అభిషేక్‌ గుప్తాతో పాటు కో-ఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అతిషి మార్లెనా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అతిషి మార్లెనా

    Delhi Water Crisis: క్షిణించిన అతిషి ఆరోగ్యం.., ఆస్పత్రికి తరలింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025