NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు 
    ప్రధానిపై కుట్ర, దేశద్రోహం..

    Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2024
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ హైకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పై కుట్ర పన్నడం దేశద్రోహంతో సమానమని, అది తీవ్రమైన నేరమని పేర్కొంది.

    ఆలోచించకుండా ఎవరైనా ప్రధానిపై కుట్ర పన్నారని ఆరోపించలేమని, ఇందుకు పక్కా ఆధారాలు ఉండాలని జస్టిస్ జస్మీత్ సింగ్ అన్నారు.

    విషయం ఏమిటి?

    న్యాయవాది జై అనంత్ డెహ్రాయ్‌పై బిజూ జనతాదళ్(బిజెడి)ఎంపి,సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించినది ఈ కేసు.

    ప్రధాని నరేంద్ర మోదీపై మిశ్రా కుట్ర పన్నారని డెహ్రాయ్ ఆరోపించారు.

    ''ప్రధానిపై కుట్ర చేయడం ఐపీసీ ప్రకారం నేరం..అది దేశద్రోహం..మీరు ప్రధానిపై కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు..దాన్ని నిరూపించాలని,లేకుంటే మీపై నిషేధాజ్ఞలు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.

    Details

    బీజేపీతో,ప్రధానితో సైద్ధాంతిక అనుబంధం ఉందన్న మిశ్రా

    డెహ్రాయ్ తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేశారని, "కానింగ్ లేన్, ఒడియా బాబు" , "పూరీ కా దలాల్" వంటి అవమానకరమైన పదాలతో తనను సంబోధించారని మిశ్రా అన్నారు.

    తనకు బీజేపీతో,ప్రధానితో సైద్ధాంతిక అనుబంధం ఉందని, ప్రధానిపై తాను ఎప్పుడూ ఎలాంటి కుట్రలు చేయలేదని మిశ్రా అన్నారు.

    మిశ్రా,తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మహువా మొయిత్రా మధ్య జరిగిన సంభాషణను తాను విన్నానని, అందులో ప్రధానిపై ఆరోపణలు చేయమని మిశ్రా మొయిత్రాకు సలహా ఇస్తున్నారని డెహ్రాయ్ చెప్పారు.

    Details 

    మిశ్రాపై సీబీఐలో ఫిర్యాదు చేశా: డెహ్రాయ్

    మిశ్రాపై సీబీఐలో ఫిర్యాదు చేశానని,తన వద్ద ఆధారాలు ఉన్నాయని డెహ్రాయ్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని డెహ్రాయ్‌ను కోర్టు ఆదేశించింది.

    మీడియాను మాట్లాడకుండా అడ్డుకోబోమని కోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణలో డెహ్రాయ్ తన సాక్ష్యాలను సమర్పించనున్నారు.

    ఆ తర్వాత మిశ్రాపై పరువు నష్టం కేసు పెట్టాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    underwater metro: భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని  భారతదేశం
    Modi in Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో మోదీ  జమ్ముకశ్మీర్
    PM modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని భారతదేశం
    LPG Gas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం గిఫ్ట్.. ఎల్‌పిజి ధర తగ్గింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025