NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి
    హిందీ పుస్తకం తేలేదని కొట్టిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి

    దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.

    తరగతి గదిలోకి హిందీ పుస్తకాన్ని తీసుకురాలేదన్న కోపంతో టీచర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.

    11 ఏళ్ల అర్బాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం సదరు విద్యార్థి ఎప్పట్లాగే పాఠశాలకు హాజరయ్యాడు.

    ఈ క్రమంలో స్కూలుకు హిందీ పుస్తకాన్ని తీసుకెళ్లడం మర్చిపోయాడు. అయితే అర్బాజ్ వద్ద హిందీ పుస్తకం లేదని గమనించిన ఉపాధ్యాయుడు, విద్యార్థిపై బిగ్గరగా అరిచాడు.

    DETAILS

    మా కుమారుడి ఆరోగ్యం క్షిణీస్తోంది : బాధిత తండ్రి 

    ఆకస్మిక పరిణామంతో విద్యార్థి బిక్కమొహం వేశాడు. తాను హిందీ పుస్తకం తీసుకురావడం మర్చిపోయనట్లు బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థి అర్బాజ్ ను చితకబాదాడు.

    టీచర్ దెబ్బలకు తట్టుకోలేకపోయిన అర్బాజ్, తీవ్ర గాయాలతో సొమ్మసిల్లిపోయాడు. ఈ క్రమంలోనే బాధితుడి మెడను కోసినట్లు తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ పరిస్థితిలో గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    మరోవైపు ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    పాఠశాలలో జరిగిన ఉదంతాన్ని విద్యార్థి పోలీసులకు చెప్పే పరిస్థితిలో లేడని తండ్రి మహ్మద్ రంజానీ అన్నారు. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    దిల్లీ

    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న  ప్రయాణికుడు ఎయిర్ ఇండియా
    Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా ఉత్తరాఖండ్
    అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025