Page Loader
Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ 
మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ

Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
07:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్‌లో సంభాషించిన విషయాన్ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరువురు నాయకుల భేటీపై రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయని తెలిపింది. "భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనను నిర్వహించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను అవసరమైన సమయంలో ప్రకటిస్తారు" అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

వివరాలు 

భారతదేశానికి కీలక అంశంగా అమెరికా వీసా విధానాలు, అక్రమ వలసదారుల సమస్య

నవంబర్‌లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ ప్రముఖ నేతల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ, ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతానని తెలిపారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలు పెంచే విధంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు, ఇందులో భారత్ కూడా చేరింది. ఇదే సమయంలో, అమెరికా వీసా విధానాలు, అక్రమ వలసదారుల సమస్య భారతదేశానికి కీలక అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మోదీ-ట్రంప్ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.