NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 15, 2023
    11:44 am
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం

    భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా రాహుల్ విదేశాల్లో చేసిన ప్రసంగానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తారని ఆమె అన్నారు.

    2/2

    పార్లమెంట్ అంటే భారత ప్రజల సమిష్టి స్వరం: స్మృతి ఇరానీ

    రాహుల్ గాంధీ భారత పార్లమెంటుకు క్షమాపణలు చెప్పాలని ప్రతి భారతీయ పౌరుడు డిమాండ్ చేస్తున్నాడని, ఇది కేవలం పార్లమెంటు సభ్యుల సమ్మేళనం కాదని, భారత ప్రజల సమిష్టి స్వరం అన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. భారత ప్రజల అభీష్టానికి రాజ్యాంగ ప్రతిబింబం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మంగళవారం పార్లమెంట్ దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం కారణంగా మంగళవారం పార్లమెంటు రోజంతా వాయిదా పడింది. గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టింది. బీజేపీ పార్లమెంటును అవమానించిందని, క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బుధవారం కూడా లోక్ సభ, రాజ్యసభలో అదే గందరగోళం కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాహుల్ గాంధీ
    స్మృతి ఇరానీ
    లోక్‌సభ
    రాజ్యసభ

    రాహుల్ గాంధీ

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం బీజేపీ
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం కాంగ్రెస్
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ

    స్మృతి ఇరానీ

    బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ ప్రధాన మంత్రి
    లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం  రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి రాహుల్ గాంధీ

    లోక్‌సభ

    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు రాజ్యసభ
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు విశాఖపట్టణం
    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన తెలంగాణ

    రాజ్యసభ

    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023