NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    తదుపరి వార్తా కథనం
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

    వ్రాసిన వారు Stalin
    Mar 15, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది.

    రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా రాహుల్ విదేశాల్లో చేసిన ప్రసంగానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తారని ఆమె అన్నారు.

    స్మృతి ఇరానీ

    పార్లమెంట్ అంటే భారత ప్రజల సమిష్టి స్వరం: స్మృతి ఇరానీ

    రాహుల్ గాంధీ భారత పార్లమెంటుకు క్షమాపణలు చెప్పాలని ప్రతి భారతీయ పౌరుడు డిమాండ్ చేస్తున్నాడని, ఇది కేవలం పార్లమెంటు సభ్యుల సమ్మేళనం కాదని, భారత ప్రజల సమిష్టి స్వరం అన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. భారత ప్రజల అభీష్టానికి రాజ్యాంగ ప్రతిబింబం అన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మంగళవారం పార్లమెంట్ దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం కారణంగా మంగళవారం పార్లమెంటు రోజంతా వాయిదా పడింది.

    గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టింది. బీజేపీ పార్లమెంటును అవమానించిందని, క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

    బుధవారం కూడా లోక్ సభ, రాజ్యసభలో అదే గందరగోళం కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    స్మృతి ఇరానీ
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ కాంగ్రెస్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం కాంగ్రెస్

    స్మృతి ఇరానీ

    బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ ప్రధాన మంత్రి

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా కాంగ్రెస్
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    రాజ్యసభ

    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025