NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు
    కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు

    Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    09:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.

    ఈ పిటిషన్‌లో, జరిగిన ప్రమాదానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరడంతో పాటు, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయబడింది.

    అదనంగా, ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు భద్రతా మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా కోరారు.

    ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం,ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

    సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

    ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా,60 మందికి పైగా గాయపడ్డారు.

    ఈ రోజు, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనంలో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా అభ్యర్థించవచ్చు.

    వివరాలు 

    PILలో డిమాండ్ చేయబడిన ముఖ్యాంశాలు 

    మహా కుంభమేళా వంటి భారీ జన సమూహాలు చేరే ప్రదేశాల్లో భద్రతా చర్యలను అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాలి.

    భక్తులకు భద్రతా మార్గదర్శకాలు అందుబాటులో ఉండేలా ప్రాథమిక సమాచారాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో అందించాలి.

    అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

    వివరాలు 

    సమాచార ప్రదర్శనలు & కమ్యూనికేషన్: 

    భక్తులకు దిశలు సూచించే బోర్డులు, రహదారి గుర్తులను వారి భాషలో ప్రదర్శించాలి.

    అత్యవసర పరిస్థితుల్లో సమాచారం తక్షణం అందించేందుకు SMS, వాట్సాప్ ద్వారా హెచ్చరిక సందేశాలను పంపే ఏర్పాట్లు చేయాలి.

    ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాగ్‌రాజ్‌లో తమ వైద్య బృందాలను మోహరించాలి.

    భక్తుల ప్రవేశం, నిష్క్రమణ సురక్షితంగా ఉండేలా గరిష్ట స్థలాన్ని కేటాయించాలి.

    2025 మహా కుంభమేళాకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని డిమాండ్.

    నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థన.

    VIP ల కదలిక భక్తుల భద్రతకు ప్రమాదకరంగా మారకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

    భక్తుల ప్రవేశ, నిష్క్రమణ కోసం గరిష్ట స్థలం కేటాయించాలి.

    వివరాలు 

    మౌని అమావాస్య రోజున ఘోర ప్రమాదం 

    మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

    అమృత స్నానం కోసం త్రివేణి సంగమం వద్ద భారీగా భక్తులు గుమిగూడారు.

    అయితే, జాతర ప్రాంగణంలో అఖాడాల వద్ద ఉన్న బారికేడ్లు అకస్మాత్తుగా విరిగిపోవడంతో భక్తుల సమూహం అదుపుతప్పింది.

    బారికేడ్లు విరిగిపోవడం వల్ల భక్తులు ఒక్కసారిగా స్నాన ఘాట్లవైపు పరుగులు పెట్టారు.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఈ ఘటన సమయంలో VIP ల కదలికలు ఏవీ లేవు.

    ఈ ప్రమాదం అనంతరం భద్రతా చర్యల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సుప్రీంకోర్టు

    SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..  భారతదేశం
    Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Supreme Court: ఏకపక్షంగా బుల్డోజర్‌ కూల్చివేతలు తగదు.. బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీం తీర్పు  భారతదేశం
    Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు యోగి ఆదిత్యనాథ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా హింస; పోలీసులపై రాళ్ల దాడి, ఏడుగురు పోలీసులు సస్పెండ్ భారతదేశం
    Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు భారతదేశం
    Sambhal mosque :మసీదు సర్వే హింసాత్మకం.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్ భారతదేశం
    Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025