NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి
    తదుపరి వార్తా కథనం
    నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి
    నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు

    నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

    నగరిలో ఎప్పటి నుంచో మంత్రి రోజా సెల్వమణి కు అసమ్మతి సెగ ఎదురవుతోంది. మొదట సభ ప్రారంభానికి ముందు కేజే శాంతి, మంత్రి రోజా మధ్య సఖ్యత తేవడానికి జగన్ ట్రై చేశారు. వారితో ఏదో మాట్లాడిన సీఎం, ఇద్దరు చేతులు కలపాలని పేర్కొన్నారు.

    మొదట కేజే శాంతి తన చేతిని ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా సీఎం ఆమె చేయిని పట్టుకొని రోజాతో చేయి కలపాలని ప్రయత్నం చేశారు. అయితే వారు అలా చేతులు కలిపిన వెంటనే వెనక్కి తీసుకోవడం గమనార్హం.

    గత కొన్ని నెలలుగా మంత్రి పెద్దిరెడ్డి, రోజా మధ్య విబేధాలు ఉన్నాయని తెలిసింది.

    Details

    జన సమీకరణకు దూరంగా ఉన్న ఐదు మండలాల ఇంఛార్జ్ లు

    సీఎం పర్యటన సందర్భంగా ఈ విబేధాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం పర్యటనలో రోజా ఫోటో ఎక్కడా లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది.

    నగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఇన్చార్జ్ లు సీఎం కు స్వాగత పలకడానికి పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, అందులో మంత్రి రోజా ఫోటోలు కనిపించలేదు.

    మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా జన సమీకరణకు రోజాకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరుగుతుండటంతో ఐదు మండలాల ఇంఛార్జ్ లు జనసమీకరణకు దూరంగా ఉన్నారు.

    ఇక జగన్ పర్యటన కోసం 50కిపైగా ప్రయివేటు పాఠశాలలకు చెందిన వ్యాన్లను మంత్రి రోజా అనుచరులు తీసుకెళ్లినట్లు తెలిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నగరి
    రోజా సెల్వమణి

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నగరి

    ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక  రోజా సెల్వమణి

    రోజా సెల్వమణి

    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025