NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?
    రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?

    Vande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2024
    03:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-పాట్నా మార్గంలో నడుపుతున్నారు.

    ఇది ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలుగా రికార్డు సృష్టించింది.

    ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి ఉదయం 8.25 గంటలకు బయలుదేరి, దాదాపు 994 కిలోమీటర్ల ప్రయాణం చేసి సుమారు 11 గంటల 30 నిమిషాల అనంతరం రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది.

    ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, డీడీయూ వంటి కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

    Details

    సోమ, గురు, శనివారాల్లో దిల్లీకి 

    ఈ ప్రత్యేక రైలు బుధ, శుక్ర, ఆదివారాల్లో దిల్లీ నుంచి బయలుదేరగా, పాట్నా నుంచి సోమ, గురు, శనివారాల్లో ఢిల్లీకి వెళ్తుంది.

    పాట్నా నుంచి ఈ రైలు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి, రాత్రి 7 గంటలకు దిల్లీ చేరుకుంటుంది.

    అయితే, ఈ రైలు పూర్తిగా డే జ‌ర్నీ సౌక‌ర్యాన్ని కలిగి ఉండడంతో స్లీపర్ క్లాస్ అందుబాటులో లేదు.

    వందేభారత్ రైలు ఛార్జీలు కూడా ప్రకటించింది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధర రూ. 4,655 గా నిర్ణయించారు.

    పుణెకు కూడా ప్రత్యేక వందేభారత్ రైళ్లు నవంబర్ 1, 3, 6 తేదీల్లో దిల్లీ నుంచి ప్రయాణించనున్నాయి.

    Details

    8 గంటల్లో ప్రయాణం పూర్తి

    రిటర్న్ సర్వీసులు నవంబర్ 2, 4, 7 తేదీల్లో ఉంటాయి. గతంలో ఢిల్లీ-వారణాసి మార్గంలో 771 కిలోమీటర్ల దూరంతో లాంగెస్ట్ వందేభారత్ రైలు నడిచింది. దానిని 8 గంటల్లో పూర్తి చేసింది.

    త్వరలోనే ఈ రూట్లో స్లీపర్ వందేభారత్ రైలును కూడా ప్రారంభించనున్నారు,

    రాత్రి ప్రయాణాల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    దీపావళి

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం
    Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా  లైఫ్-స్టైల్
    Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ రియల్ మీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025