
Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈవీఎం (EVM)లలో అభ్యర్థుల ఫొటోలు,పార్టీ గుర్తులను బ్లాక్ అండ్ వైట్ (Black & White) రూపంలో మాత్రమే ముద్రించేవారు. అయితే, ఇక నుండి ఈ ఫొటోలు కలర్ (Color) రూపంలో ప్రదర్శించబడనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం, ఈ కొత్త నిబంధన బిహార్ ఎన్నికల నుంచే అమల్లోకి రానుంది.
వివరాలు
స్పష్టంగా గుర్తించగలిగేలా, పార్టీ గుర్తులతో పాటు ఫొటోలు
ఈవీఎం వ్యవస్థ పేపర్ బ్యాలెట్కు ప్రత్యామ్నాయంగా రూపొందించబడినది. అయినప్పటికీ, ఈ వ్యవస్థపై కొన్ని రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలోకి పెట్టుకొని, ఓటర్లు అభ్యర్థులను స్పష్టంగా గుర్తించగలిగేలా, పార్టీ గుర్తులతో పాటు ఫొటోలు కూడా అతి స్పష్టంగా కనిపించే విధంగా కలర్ ఫొటోలు ముద్రించాలని సీఈసీ నిర్ణయించారని స్పష్టం చేశారు. ఈ మార్పు ద్వారా, ఎలాంటి అవకతవకలకు తావు లేదంటూ ఈవీఎంలపై కలర్ ఫొటోలను ముద్రించాలని నిర్ణయించామని సీఈసీ (CEC) స్పష్టం చేసింది.