NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే
    మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు ఏక్‌నాథ్ షిండే

    Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    02:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.

    ముఖ్యమంత్రి పదవి విషయంలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు ముంబయిలో జరగాల్సిన కీలక సమావేశం రద్దు అయ్యిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో నిన్న మహాయుతి నేతలు ఏక్‌నాథ్‌ షిండే, దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌లు సమావేశమయ్యారు.

    వివరాలు 

    షిండే ప్రస్తుతం తన స్వగ్రామంలో ఉన్నారు

    "మహారాష్ట్ర సీఎం పదవి (Maharashtra CM Post)పై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సానుకూల చర్చలు జరిగాయి. ముంబయిలో మరోసారి చర్చలు జరిపి నిర్ణయం ప్రకటిస్తాం" అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శిందే (Eknath Shinde) తెలిపారు.

    అయితే, ముంబయిలో జరగాల్సిన ఈ కూటమి సమావేశం ఇప్పుడు రద్దయిందని సమాచారం.

    అలాగే, శివసేన పార్టీ సమావేశం కూడా రద్దయిందని తెలుస్తోంది.

    షిండే ప్రస్తుతం తన స్వగ్రామం సతారాలో ఉన్నారని, అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత సమావేశాలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

    వివరాలు 

    సీఎంగా చేసిన వ్యక్తిని మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం సమంజసం కాదు:  సంజయ్‌ సిర్సాత్‌ 

    మరోవైపు, ముఖ్యమంత్రి రేసులో ఫడణవీస్‌ ముందు ఉన్నా, మరో ప్రత్యామ్నాయంపై బీజేపీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

    మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలపై బీజేపీ అధిష్ఠానం విశ్లేషణ చేస్తోందని తెలుస్తోంది.

    ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ శిందే తిరస్కరించారని ఆయన సమీప వర్గాలు వెల్లడించాయి.

    "సీఎంగా చేసిన వ్యక్తిని మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా చేయడం సమంజసం కాదని" శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ సిర్సాత్‌ వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే

    తాజా

    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్
    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025