LOADING...
EC-Rahul Gandhi: 'సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన  ఎన్నికల సంఘం 
EC-Rahul Gandhi: రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన  ఎన్నికల సంఘం

EC-Rahul Gandhi: 'సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన  ఎన్నికల సంఘం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలు పూర్తిగా నిరాధారమని, వాస్తవం కాదని ఈసీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ఎవరి ఓటు తొలగించడం అసాధ్యమని స్పష్టంచేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

వివరాలు 

ఎన్నికల సంఘమే స్వయంగా ఫిర్యాదు

"సంబంధిత ఓటరికి ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎవరి ఓటును తొలగించడం జరగదు. అలాగే ఆన్‌లైన్‌లో ఇతరుల చేత ఓటు తొలగింపు జరిగే అవకాశం లేదు. 2023లో అలంద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కొందరు ఓటర్ల తొలగింపునకు ప్రయత్నించారు.అయితే ఆ యత్నాలు విఫలమయ్యాయి.ఆ సంఘటనపై విచారణ జరపమని ఎన్నికల సంఘమే స్వయంగా ఫిర్యాదు చేసింది.రికార్డుల ప్రకారం 2018లో అలంద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, 2023లో కాంగ్రెస్‌ నేత బీఆర్‌ పాటిల్ గెలుపొందారు"అని ఈసీ వివరించింది.

వివరాలు 

బీజేపీ విమర్శలు 

రాహుల్‌ గాంధీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. మాజీ కేంద్ర మంత్రివర్గ సభ్యుడు రవిశంకర్‌ ప్రసాద్ మాట్లాడుతూ.. "రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదు. 2014 నుంచి ప్రధాని మోదీ సాధించిన విజయాలను ఆయన అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ప్రజలను, ఓటర్లను అవమానపరచేవి. ఆయన హైడ్రోజన్‌ బాంబు గురించి వ్యాఖ్యానించడం పూర్తిగా నిరాధారమైంది. కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించి, ప్రజల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడడానికి బదులు కోర్టుల జోక్యాన్ని ఆశ్రయిస్తున్నారు. మిగతా సమయంలో ఇతరులపై ఆరోపణలు మోపుతున్నారు" అని విమర్శించారు.

వివరాలు 

హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఆ బాంబ్ ఇలాగే ఉంటుందా..?

దిల్లీ మంత్రి మజీందర్‌ సింగ్‌ సిర్సా కూడా రాహుల్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "కాంగ్రెస్‌ నాయకులు హైడ్రోజన్‌ బాంబు పేల్చుతామంటున్నారు. అది ఇలాగే ఉంటుందా? ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఆ వాస్తవాన్ని అంగీకరించడం బదులు ఇతరులపై నిందలు వేస్తున్నారు. తమ స్థాయిని పెంచుకోవడమే లక్ష్యంగా ఉండాలి కానీ కోర్టుల జోక్యం కోరడం లేదా ఆరోపణలు మోపడం సరైనది కాదు" అని అన్నారు.

వివరాలు 

భారత్‌లో బంగ్లాదేశ్‌, నేపాల్‌ల మాదిరి అశాంతి వాతావరణం

అంతేకాక బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యానిస్తూ - "రాహుల్‌ భారత్‌లో బంగ్లాదేశ్‌, నేపాల్‌ల మాదిరి అశాంతి వాతావరణం సృష్టించాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ ఇప్పటివరకు దాదాపు 90 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అందుకే ఆయన అసహనం రోజురోజుకీ పెరుగుతోంది. క్షమాపణలు చెప్పడం, కోర్టుల మందలింపులు స్వీకరించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది" అని తీవ్రంగా విమర్శించారు.