Page Loader
Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?
లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

వ్రాసిన వారు Stalin
May 08, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్‌ 9, ఉత్తరప్రదేశ్‌‌ 13, పంజాబ్‌ 13 , బీహార్‌ 8, ఒడిశా 6, హిమాచల్‌ ప్రదేశ్‌ 4, జార్ఖండ్‌‌లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్‌లో పోలింగ్ జరగనుంది.

Details 

వారణాసి లోక్ సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్

ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్ సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి (బుధవారం) నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు.