NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 08, 2023
    10:52 am
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

    విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్రాలు, పంపిణీదారుల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్న కమిటీ నివేదికను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. , విద్యుత్ సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ 2022 ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లును నవంబర్ 21, 2022న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ప్యానెల్‌ను ఆదేశించారు.

    2/2

    విద్యుత్ సవరణ బిల్లు- 2022 అంటే?

    విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం, నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు పునరుత్పాద ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. విద్యుత్ సవరణ బిల్లు- 2022 బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ పంపిణీ వ్యాపారానికి లైసెన్స్ అవసరం ఉండదు. అలాగే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌కి బదులుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే కాన్సప్ట్‌ను తీసుకొస్తారు. ఈఆర్సీ వద్ద నమోదు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మారొచ్చు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. ఆర్పీపీఓ కింద విద్యుత్ సంస్థలు తప్పుకుండా కనీసం కొంత మొత్తమైనా పునరుత్పాదక విద్యుత్‌ను కచ్చితంగా కొనుగోలు చేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    లోక్‌సభ
    రాజ్యసభ
    విద్యుత్ శాఖ మంత్రి

    లోక్‌సభ

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు విశాఖపట్టణం
    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన తెలంగాణ
    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ కాంగ్రెస్

    రాజ్యసభ

    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    విద్యుత్ శాఖ మంత్రి

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక  తమిళనాడు
    కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు  విద్యుత్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023