LOADING...
Chhattisgarh: సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం
సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం

Chhattisgarh: సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు పలువురు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారని పోలీసులు తెలిపారు. శనివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాలు వెంటనే ప్రతిస్పందించి మావోయిస్టులకు ధీటుగా ఎదురుదాడి చేశారు.

Details

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు

ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు పరిశీలించాయి. ఇంకా మిగతా నక్సలైట్లు తప్పించుకున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సుక్మా జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా పేరొందింది. గతంలో కూడా ఇక్కడ భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య అనేక ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలను అణచిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.