NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 
    కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు

    తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 03, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రవీంద్రనాథ్ పై ఓ మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేశారు.

    తనను అన్నగా భావించానని, కానీ తనపైనే ఆశపడటం పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించకపోతే చంపేస్తానని రవీంద్రనాథ్ బెదిరించినట్లు గాయత్రిదేవి వెల్లడించారు. అటు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానన్నారు.

    2014లో ఓ పెళ్లిలో పన్నీరు సెల్వం కుటుంబంతో తమకు పరిచయమైందని గాయత్రి పేర్కొన్నారు.

    ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంగా మెలిగే వాళ్లమని ఆమె వివరించింది.

    రవీంద్రనాథ్‌ను సోదరుడిగా భావించి సన్నిహితంగా మెలిగానని, 2022 చివరి నుంచి రవీంద్రనాథ్ వేధింపులు మొదలయ్యాయన్నారు.

    DETAILS

    రవీంద్రనాథ్ కుటుంబీకులకు చెప్పినా పట్టించుకోలేదు: గాయత్రీ దేవి

    ఈ మధ్య రవీంద్రనాథ్ స్నేహితుడు ఒకరు తనకు ఫోన్ చేసి నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం, సహకరిస్తే రాణిలా ఉంటావని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు చెప్పుకొచ్చింది.

    మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోలేదని, ఒక రోజు రవీంద్రనాథ్ మద్యం మత్తులో తనకు ఫోన్ చేశాడని చెప్పింది. ఆ సందర్భంగా అసభ్యకరంగా దూషించాడని, ఆ మాటలు తీవ్రంగా బాధించినట్లు గాయత్రి దేవి గోడు వెల్లబోసుకుంది.

    ఇటీవలే వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ప్రశాంతంగా నిద్ర లేకుండా చేశారని ఆవేదనకు లోనైంది. రవీంద్ర కుటుంబీకులకు జరిగింది చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది.

    రవీంద్ర బ్లాక్ మెయిల్ కారణంగా భయాందోళనలకు గురయ్యాయని, అందుకే పోలీసుల సహాయం కోసం వచ్చానని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తమిళనాడు

    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025