NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ 
    కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ

    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం భారీ నౌకా ప్రమాదం సంభవించింది.

    సింగపూర్ జెండాతో కలిగిన భారీ కంటైనర్ నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు జరిగింది.

    ఈ అనూహ్య ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది.

    ఈ ఘటనకు సంబంధించి రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 10:30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

    ఇది కేరళ తీరానికి సమీపంలో జరిగింది.నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

    వివరాలు 

    సముద్రంపై గగనతల పర్యవేక్షణ

    ప్రమాద వార్త విన్న భారత నౌకాదళం అప్రమత్తమై వెంటనే ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌకను ఘటన స్థలానికి పంపింది.

    అదేవిధంగా ఐఎన్ఎస్ గరుడ్ అనే కొచ్చిన్ నేవల్ ఎయిర్ స్టేషన్‌ నుంచి డోర్నియర్ నిఘా విమానంను ప్రయోగించి,సముద్రంపై గగనతల పర్యవేక్షణ ప్రారంభించారు.

    ఈ చర్యల ద్వారా నౌకలోని సిబ్బంది పరిస్థితి, నౌక స్థితిగతులు పరిశీలించారు.

    ప్రమాదానికి గురైన ఎంవీ వాన్ హై 503 అనేది సుమారు 270మీటర్ల పొడవుతో కూడిన ఒక భారీ కంటైనర్ నౌక.

    ఈ నౌక తన ప్రయాణాన్ని జూన్ 7వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబో ఓడరేవు నుంచి ప్రారంభించింది.

    షెడ్యూల్ ప్రకారం,జూన్ 10వ తేదీన ముంబై చేరాల్సి ఉంది.అయితే మార్గమధ్యంలో, కేరళ తీరానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది.

    వివరాలు 

    లైబీరియా దేశానికి చెందిన 24 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

    ఇటీవల కేరళ తీరంలో మరొక నౌక ప్రమాదానికి గురైంది. లైబీరియా దేశానికి చెందిన ఎంఎస్‌సీ ఎల్సా-3 అనే నౌక, కేరళ తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఒక్కసారిగా ఒకవైపునకు ఒరిగిపోయింది.

    దీంతో నౌకలోని కొన్ని కంటైనర్లు నేరుగా సముద్రంలో పడిపోయాయి.

    ఈ ప్రమాదానికి స్పందించిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నౌకలోని 24 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చింది.

    ఆ నౌకలో చమురు, ఫర్నేస్ ఆయిల్, అలాగే కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ
    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు  మేఘాలయ

    కేరళ

    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! కేంద్ర ప్రభుత్వం
    Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి రోడ్డు ప్రమాదం
    Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
    Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025