NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers protest : పార్లమెంట్‌ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్
    తదుపరి వార్తా కథనం
    Farmers protest : పార్లమెంట్‌ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్
    పార్లమెంట్‌ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్

    Farmers protest : పార్లమెంట్‌ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 02, 2024
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇవాళ దిల్లీకి వేలాదిమంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ రైతులు నోయిడాలో సమావేశమయ్యారు.

    ఈ పరిస్థితి నేపథ్యంలో ఆ ప్రాంతంలో 5వేల మంది సైనికులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకున్నారు. రైతుల పాదయాత్ర కారణంగా నోయిడాలోని అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

    మహామాయ ఫ్లైఓవర్ వద్ద రైతులు ఏకమయ్యే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరోవైపు, పోలీసులు పలు ప్రాంతాలలో నిఘా కొనసాగిస్తున్నారు.

    ముఖ్యంగా కొన్ని మార్గాలను దారి మళ్లించారు. రైతులు దిల్లీకి పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. అందుకే చిల్లా సరిహద్దు, ఢిల్లీ-నోయిడా రహదారులపై ట్రాఫిక్ భారీగా ఏర్పడింది.

    ఉదయం నుంచి ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రైతులు దిల్లీకి పాదయాత్ర చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    Details

    భారీగా భద్రతా దళాలు మోహరింపు

    రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది.

    భద్రతా కారణంగా, 5000 మంది సైనికులను అక్కడ మోహరించగా, అదనంగా 1000 మంది పీఏసీ సిబ్బంది, నీటి ఫిరంగులు, వజ్ర వాహనాలు, టియర్ గ్యాస్ తదితర పరికరాలను రంగంలోకి ప్రవేశపెట్టారు.

    ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

    రైతులు తమ డిమాండ్లను అంగీకరించకపోతే, మహామాయ ఫ్లైఓవర్ మీదుగా దిల్లీకి వెళ్లి పార్లమెంట్‌ను చుట్టుముడతామని హెచ్చరించారు.

    తమ డిమాండ్లపై చర్చలు సాగించినప్పటికీ, ఆర్థిక పరిష్కారం లేకపోవడంతో పాదయాత్రను ప్రారంభించారు. రైతుల డిమాండ్లలో ప్రధానంగా, పరిహారం పెంపు, భూమి అభివృద్ధిపై ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    పార్లమెంట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    Air Pollution: దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ  భారతదేశం
    Air Pollution : దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత! వాయు కాలుష్యం
    Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు ఇండియా
    Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు వాయు కాలుష్యం

    పార్లమెంట్

    Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు?  బీజేపీ
    Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్  లోక్‌సభ
    Parliament Security Breach:8 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన లోక్ సభ సెక్రటేరియట్  భారతదేశం
    Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025