NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
    ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం

    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2024
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

    ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 30 మంది వరకు మరణించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    బస్సులో అప్పటివరకు 50-55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ పట్టు కోల్పోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

    ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

    Details

    ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

    క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదం వధువు ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగింది.

    హరిద్వార్ జిల్లా లాల్ ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖాల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    స్థానిక ఎమ్మెల్యే రీతూ ఖండూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స బాధితులను పరామర్శించారు.

    ఈ ఏడాది జూన్‌లో కూడా గంగోత్రి నేషనల్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి వాగులో పడటంతో ముగ్గురు మరణించగా, 24 మంది గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    ఉత్తరాఖండ్

    Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్  తాజా వార్తలు
    Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్  తాజా వార్తలు
    Uttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్ భారతదేశం
    Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్  తాజా వార్తలు

    రోడ్డు ప్రమాదం

    Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి తమిళనాడు
    UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం ఉత్తర్‌ప్రదేశ్
    LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు  ఎల్బీనగర్
    Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025