Page Loader
Road accident: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు 
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు

Road accident: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

శనివారం తెల్లవారుజామున ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొల్హాపూర్ నుండి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు భోట్ ఘాట్ సమీపంలోని ఖోపోలిలోని ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ఉదయం 4 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 23 మందికి గాయాలు కాగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఐఆర్‌బీ యాంబులెన్స్ సర్వీస్‌కు చెందిన అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడినవారిని కామోఠేలోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.