NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!
    తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!

    Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 11, 2025
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశముందని 'ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

    రామగుండం ప్రాంతం వద్ద భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి, మహారాష్ట్ర వరకూ కనిపించవచ్చని వివరించారు.

    అయితే ఈ అంచనాలను ఇప్పటివరకు ప్రభుత్వం లేదా అధికారిక శాస్త్రీయ సంస్థలు ధృవీకరించలేదు.

    భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    గతంలో డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం సమీపంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

    Details

    తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2గా ఏర్పాటు

    దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం సహా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల వరకు కూడా కనిపించింది.

    అయితే తెలంగాణ భూభాగం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2కు చెందుతుంది.

    గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉన్న నేపథ్యంలో అక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    గతంలో జరిగిన భూకంపాలు పెద్దగా నష్టం కలిగించలేదని వారు గుర్తుచేశారు.

    ఇటీవల పెద్దపల్లి జిల్లాకు సంబంధించి భూకంప హెచ్చరికలు ఉన్నట్లు 'ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Details

    గతంలోనూ భూకంపాలు

    అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు స్పష్టం చేశారు.

    భూకంపాల చరిత్రను పరిశీలిస్తే, 1969లో ప్రకాశం జిల్లా ఒంగోలులో 5.1 తీవ్రతతో, 1998లో ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.

    అలాగే 1984, 1999, 2013 సంవత్సరాల్లో హైదరాబాద్ పరిసరాల్లో స్వల్ప భూకంపాలు సంభవించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.

    నిపుణులు భూకంపాలు ఎప్పుడెప్పుడు సంభవిస్తాయో ముందుగానే చెప్పడం కష్టమని తెలిపారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    భూకంపం

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    తెలంగాణ

    Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఆంధ్రప్రదేశ్
    New Excise Police Stations: హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు.. వరంగల్‌ అర్బన్‌లో ఒకటి  భారతదేశం
    Kamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి కామారెడ్డి
    TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్ ఇండియా

    భూకంపం

    Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంపించిన భూమి  భారతదేశం
    Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌  పాకిస్థాన్
    Earthquake: బ్రిటీష్ కొలంబియా తీరంలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు  కెనడా
    Japan: జపాన్ తీరంలో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025