NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 
    తదుపరి వార్తా కథనం
    పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 
    కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు

    పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 13, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది.

    కాస్త విరామం తీసుకున్న యువకుడు ప్రేమ గాయాలను మర్చిపోయి పెద్దల ప్రోత్సాహంతో వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు, ఆమె మాజీ ప్రియుడైన పార్తిబన్‌ను కిడ్నాప్‌ చేసింది.

    అనంతరం బలవంతంగా ఓ గుడికి తరలించింది. తీవ్ర ఒత్తిడి మధ్య తాళి కట్టించుకుంది.

    ఇంతలో తన భర్త కనిపించకుండాపోయాడని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల జాడను కనిపెట్టారు.

    ఈ క్రమంలోనే బాధిత యువకుడిని విడిపించిన పోలీసులు, నిందితురాలి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.

    details

    ప్రియుడి కిడ్నాప్ కోసం యువతి కుటుంబ సభ్యులు ప్లాన్ 

    చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పార్తిబన్‌, వెల్లూరులోని రాణిపేట యువతి సౌందర్య మనసులు కలవడంతో దీర్ఘకాలం ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి విడిపోయారు.

    పార్తిబన్‌‌కి పెళ్లైందన్న విషయం తెలిసి, తాను అతన్నే పెళ్లిచేసుకుంటానని, తనను మర్చిపోలేకపోతున్నట్లు కుటుంబీకులకు చెప్పింది. పార్తిబన్‌తోనే తన పెళ్లి జరిపించాలని తల్లి ఉమను పట్టుబట్టింది.

    సౌందర్య కోసం పార్తిబన్‌ కిడ్నాప్‌కు ఆమె కుటుంబం స్కెచ్‌ వేసింది. శుక్రవారం ఉదయం పార్తిబన్‌ను అతని నివాసం నుంచి అపహరించి నేరుగా కాంచీపురంలోని గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించారు.

    పార్తిబన్ భార్య ఫిర్యాదు మేరకు నిందితుల గుట్టు రట్టైంది.ఈ మేరకు సౌందర్యతో పాటు ఆమె తల్లి ఉమ, బంధువులు రమేశ్‌, శివకుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిడ్నాప్
    తమిళనాడు
    సాఫ్ట్ వేర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కిడ్నాప్

    Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు జమ్ముకశ్మీర్
    మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి మహారాష్ట్ర

    తమిళనాడు

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు మహిళ
    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    సాఫ్ట్ వేర్

    ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్  ప్రపంచం
    ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025