NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం
    బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం

    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

    ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.

    ఇటీవల భారత్ పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఒక సైనిక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి తమ సాహసంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

    ఆపరేషన్‌లో చోటుచేసుకుంటున్న అంశాలను ఆమె సమయానికి మీడియాతో పంచుకుంటూ, దేశ ప్రజల ప్రశంసలు పొందారు. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

    వివరాలు 

    కున్వర్ విజయ్ షా పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్

    అయితే, ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసాయి.

    ఆయన మాట్లాడుతూ.."పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశ సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తుంటే, అదే మతానికి చెందిన ఓ మహిళ అయిన కల్నల్ సోఫియా ఖురేషిని ప్రధాని మోదీ పాకిస్థాన్‌పైకి పంపించారు" అని అన్నారు.

    ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

    దేశ గౌరవాన్ని దక్కించుకున్న ఓ మహిళపై ఇలాంటివి మాట్లాడటం సహించదగ్గ విషయం కాదని, వెంటనే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

    వివరాలు 

    విజయ్ షాపై కేసు నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు

    అంతేకాక, జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది.

    తాజా పరిణామాల్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింతగా ప్రాచుర్యం పొందడంతో, మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించింది.

    వెంటనే మంత్రి కున్వర్ విజయ్ షాపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర
    Masood Azhar: ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే అవ‌కాశాలు పాకిస్థాన్
    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం  స్టాక్ మార్కెట్

    మధ్యప్రదేశ్

    Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు  భారతదేశం
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం,ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి  భారతదేశం
    Indore: ఇండోర్ లోక్‌సభ స్థానంలో నోటాకు 1.7 లక్షల ఓట్లు.. గోపాల్‌గంజ్‌ గత రికార్డు బద్దలు  ఇండోర్
    Madhyapradesh : పాఠశాల పాఠ్యాంశాల్లో 'ఎమర్జెన్సీ' కాలాన్ని చేర్చనున్న మధ్యప్రదేశ్  మోహన్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025