Sanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్పై కేసు
బీజేపీ యవత్మాల్ కన్వీనర్ నితిన్ భుతాద్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పార్టీ మౌత్ పీస్'సామ్నా'లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 'అభ్యంతర' కథనం రాసినందుకు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్పై కేసు నమోదైంది. ఈ కథనం డిసెంబర్ 11న ప్రచురించబడింది. ప్రస్తుతం రౌత్పై భారత శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక కథనాలు తరచుగా 'సామ్నా'లో ప్రచురితమవుతాయి. ఇటీవల రౌత్ తన కాలమ్ 'రోఖ్థోక్'లో,మధ్యప్రదేశ్లోని తన సొంతగడ్డపై శివరాజ్ సింగ్ను కించపరిచే అవకాశాన్ని బిజెపి హైకమాండ్ వదిలిపెట్టలేదని, పిఎం మోడీ,హోంమంత్రి అమిత్ షాల లక్ష్యం కాంగ్రెస్ను ఓడించడం కాదు, చౌహాన్ను తొలగించడం అని అన్నారు.