NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు 
    మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు

    Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది.

    గర్భగుడిలో హోలీ రోజున జరుగుతున్న భస్మ హారతి సందర్భంగా గులాల్ ఊదడంతో మంటలు వ్యాపించి 13 మందికి కాలిన గాయాలయ్యాయి .

    గాయాలైన వారిలో పూజారులు,సేవకులు ఉన్నారు. క్షతగాత్రులందరినీ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    మహాకాల్ ఆలయంలో, భస్మర్తి ప్రధాన పూజారి, సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, సేవకుడు మహేష్ శర్మ, చింతామన్ గెహ్లాట్,పలువురు గాయపడ్డారు.

    భస్మ హారతి సమయంలో కూడా గులాల్ వాడతారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.

    Details 

    13 మంది పూజారులకు కాలిన గాయాలు 

    భస్మ హారతి సందర్భంగా ఈరోజు గర్భగుడిలో కర్పూరం వెలిగించగా, లోపల ఉన్న 13 మంది పూజారులకు కాలిన గాయాలయ్యాయి .

    వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోతైన గాయాలు లేవు, అన్నీ స్థిరంగా ఉన్నాయి. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. ఆలయంలో దర్శనం సజావుగా సాగుతోంది. ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.

    జ్యోతిర్లింగ మహాకాళేశ్వరాలయంలో వేలాది మంది భక్తులు ఉన్నారు. అందరూ మహాకాల్‌తో హోలీని జరుపుకుంటున్నారు.

    ఆరతి చేస్తున్న పూజారి సంజీవ్‌పై వెనుక నుంచి ఎవరో గులాల్ పోశారని గాయపడిన సేవకుడు చెప్పాడు. గులాల్ దీపం మీద పడింది.

    Details 

    అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు 

    గులాల్‌లో రసాయనాలు ఉండటం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చు. మరోవైపు, గర్భగుడి వెండి గోడకు రంగు, గులాల్ నుండి రక్షించడానికి అక్కడ ఫ్లెక్సీ ని ఉంచారు. వీటిలో కూడా మంటలు వ్యాపించాయి.

    మంటలు చెలరేగడంతో కొంత మంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారని తెలిపారు.

    అయితే అప్పటికి గర్భగుడిలో హారతి చేస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషి సహా 13 మందికి కాలిన గాయాలయ్యాయి.

    ఈ విషయమై కలెక్టర్ నీరజ్ సింగ్ మాట్లాడుతూ.. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై ఓ కమిటీ విచారణ జరుపుతుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    మధ్యప్రదేశ్

    హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం బీజేపీ
    Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Priyanka Gandhi: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం (వీడియో) ప్రియాంక గాంధీ
    Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025