Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..కాలిన ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు
దిల్లీలోని ఎయిమ్స్లోని టీచింగ్ బ్లాక్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. తెల్లవారుజామున 5.59 గంటలకు కాల్ రావడంతో ఏడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 6.20 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు వారు తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ప్రకారం, ఆసుపత్రిలోని రెండవ అంతస్తులోని టీచింగ్ బ్లాక్లోని డైరెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. "ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అయితే కొన్ని ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, రిఫ్రిజిరేటర్, ఆఫీసు ఫర్నిచర్ మంటల్లో కాలిపోయాయి" అని DFS అధికారి తెలిపారు.